పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య..!

వాలంటైన్ డే ముందు రోజు ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని దేశాయిపేట విఘ్నేశ్వర కాలనీ సమీపంలో ఇద్దరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు దేశాయిపేటకు చెందిన సాయి సతీస్, షకీనాగా గుర్తించారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Leave a Comment