‘నేను దేవుడిని కాదు’

కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ పేదల పాటి దేవుడయ్యాడు. ఎంతో మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చాడు. అంతే కాదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఎవరైనా చెబితే చాలా.. వారికి సహాయం అందించాడు. ఈ క్రమంలో అతని జీవితం ఆధారంగా బుక్ రాస్తున్నట్లు సోనూ సూద్ ప్రకటించాడు. 

ఈ విషయాన్ని ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ధ్రువీకరించింది. ‘నేను దేవుడిని కాదు(I AM NO MESSIAH)’ అనే పేరుతో పుస్తకం రానుంది. ఈ పేరు ఎంచుకోవడానికి కారణం ఏమిటని అడిగితే సోనూ సూద్ ఈ విధంగా అన్నారు. ‘ప్రజలు నన్ను దేవుడని పిలుస్తున్నారు. కాని నేను దేవుడిని కాదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మనుషులుగా మన బాధ్యత’ అని చెప్పారు. ఈ పుస్తకం డిసెంబర్ లో విడుదల కానుంది. 

Leave a Comment