కన్న తల్లిని పదేళ్లు బంధించిన కొడుకులు..!

కన్నతల్లిపట్ల కర్కషంగా ప్రవర్తించారు ఇద్దరు కొడుకులు.. ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్ల పాటు బంధించారు. దీంతో ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు, జిల్లాలోని కావేరినగర్ కి చెందిన జ్ఞానజ్యోతి(72)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు. 

పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్ చెన్నైలో పోలీస్ ఇన్ స్పెక్టర్ కాగా.. చిన్న కుమారుడు వెంకటేశన్ దూరదర్శన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితం జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె చనిపోయారు. ఆస్తి గొడవల కారణంగా ఇద్దరు కొడుకులు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో తల్లిని పట్టించుకోకుండా పదేళ్ల కింద ఆమెను ఓ ఇంట్లో బంధించారు.. 

వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్ లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు..ఆమె పరిస్థితి చూసి ఇరుగుపొరుగు వారు ఆహారం ఇచ్చేవారు. ఇటీవల ఈ విషయం గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు ఆమెను కాపాడారు. ఆమె ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్ఞానజ్యోతి మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో చికిత్స కోసం తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.    

 

 

Leave a Comment