అవి శ్రీరాముడి ఆలోచనకే వ్యతిరేకం.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..!

భారతదేశంలో మతకల్లోలాలను సృష్టించి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై ఆయన స్పందించారు. ఈక్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యూహాలను ఆయన ఎండగట్టారు.. 

మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లో జరుగుతున్న పరిణామాలను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడని అన్నారు. పండుగ సందర్భంగా చెలరేగిన హింస శ్రీరాముడి ఆలోచనకే వ్యతిరేకమన్నారు. రామ మందిర ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసి.. ఇప్పుడు శ్రీరాముడి పేరుతో కత్తులు దూస్తున్నారని వ్యాఖ్యానించారు. 

కొన్నేళ్ల క్రితం సంస్కృతికి వారధిగా ఉండే శ్రీరామ నవమి వేడుకలు.. ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని రౌత్ విమర్శించారు. ఇటువంటి పనులు శ్రీరాముడి ఆలోచనలకే విరుద్ధమని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలాఖా అయిన గుజరాత్ లో శ్రీరామ నవమి యాత్రపై ముస్లింలు దాడి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు.. 

Leave a Comment