నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఏడుగురు జవాన్లు మృతి..!

లద్దాఖ్ లో శుక్రవారం ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా.. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భారత జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపుతప్పి షియోక్ నదిలో పడిపోయింది..

రోడ్డు నుంచి దాదాపు 50-60 అడుగుల దిగువకు దొర్లిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 26 మంది సైనికులతో బృందం పార్తాపుర్ శిబిరం నుంచి సరిహద్దుకు సమీపంలోని హనీఫ్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్తాపుర్ లోని 403 ఫీల్డ్ ఆస్పత్రికి తరతించారు. మెరుగైన చికిత్స కోసం హర్యాణాలోని పంచకుల జిల్లా చండీమందిర్ లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 

Leave a Comment