‘ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’.. ఎన్టీఆర్ భావోద్వేగం..!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాతయ్యకు నివాళులు అర్పించారు.  

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తాతయయను స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనుసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి  కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే  నా  ఘన నివాళి!’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.    

 

Leave a Comment