సరదాగా గడిపేందుకు వెళ్లిన.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండెపోటుతో..!

ఆదివారం కదా అని కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో చోటుచేసుకుంది. సత్యవేడు మండలం చిగురుపాళెం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజీనిర్ గా పనిచేస్తున్నారు. 

సెలవులకు తన స్వగ్రామం చిగురుపాళెంకు వచ్చారు. ఆదివారం కావడంతో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రం సందర్శనకు వెళ్లారు. అక్కడ జలపాతాల వద్ద సరదాగా గడిపారు. అయితే మధ్యహ్నం సమయంలో ప్రభాకర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. 

దీంతో కారు నడుపుతూ తిరుగుపయనమయ్యారు. దరఖాస్తు గ్రామం వద్ద ప్రభాకర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ప్రభాకర్ రెడ్డి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడి భార్య రజితకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రభాకర్ రెడ్డి మార్గమధ్యంలోనే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment