అమెజాన్ లో ఆర్డర్ చేస్తే ఫోన్ కు బదులు సబ్బు, సర్ఫ్.. ఆమెజాన్ సంస్థకు ఫైన్..

2020 డిసెంబర్ లో ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారునికి అమెజాన్ ఫోన్ కు బదులుగా సబ్బు, సర్ఫ్ ను అందించింది. ఈ కేసులో అమెజాన్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం-2 ఫైన్ వేసింది. ఫోన్ విలువతో పాటు రూ.10 వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఫోరం సభ్యుడు పీవీటీఆర్ జవహర్ బాబు, ఒక్కంటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. 

హైదరాబాద్ బీకే గూడ పార్కు వద్ద నివసించే ఓ వ్యక్తి  2020 డిసెంబర్ 19న అమెజాన్ లో ఒప్పో ఫోన్ ను రూ.11,990 చెల్లించి ఆర్ఢర్ చేశాడు. అయితే పార్సల్ లో ఫోన్ కు బదులుగా ఒక సబ్బు, సర్ఫ్ ప్యాకెట్ వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి అమెజాన్ కు మెయిల్ చేశాడు. అయితే స్పందించలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. 

దీనిపై అమెజాన్ ఇండియా మేనేజర్, అప్పారియా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ కు ఫోరం నోటీసులు జారీ చేసింది. 

అమెజాన్ తరఫున హాజరైన న్యాయవాదులు సరైన సాక్ష్యాలు చూపించకపోవడంతో విజయ్ కుమార్ ఫోన్ కోసం చెల్లించిన మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది. 

 

Leave a Comment