స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్..!

టీమిండియా, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన చివరి వన్డే ఉత్కంఠభరింతంగా సాగింది. ఈ మ్యచ్ లో టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ మహిళల జట్టుపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన పట్టుకున్న క్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ కే ఈ క్యాచ్ హైలెట్ గా నిలిచింది. 

59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్న నాట్ స్కీవర్.. దీప్తి బౌలింగ్ లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో బౌండిరీ లైన్ వద్ద స్మృతి మంధాన డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ ఒడిసి పట్టుకుంది. ప్రస్తుతం స్మృతి క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మూడు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. 

Leave a Comment