దిమ్మతిరిగే వార్త:  మాజీ భార్యే ఓ వ్యక్తికి సవతి తల్లి అయింది..!

కొన్ని వార్తలు మనల్ని షాక్ కు గురిచేస్తుంటాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపడుతుంటారు. సాధారణంగా తండ్రీ కొడుకుల మధ్య వివాదాలు జరుగుతుంటాయి. అయితే అవి ఆస్తి విషయంలో.. ఉద్యోగం, ప్రేమ విషయంలో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఓ మహిళ కోసం తండ్రీకొడుకులు గొడవపపడ్డారు. ఎందుకంటే ఆ కొడుకు మాజీ భార్య అతడికి ఇప్పుడు సవతి తల్లి అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బదాయూ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు 2016లో ఓ వ్యక్తి మరో అమ్మాయికి పెళ్లి జరిగింది. అప్పటికి వారిద్దరూ మైనర్లు.. అయితే ఆరు నెలల తర్వాత ఇద్దరికి బేధాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఆ వ్యక్తి తాగుబోతని, అతడు తనకు వద్దని అమ్మాయి విడాకులు తీసుకుంది.

ఆ తర్వాత కొంత కాలానికి ఆ వ్యక్తి తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆ వ్యక్తి పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాల సేకరించాలని ఆర్టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు బాగోతం వెలుగుచూసింది. ఆ వ్యక్తి విడాకులు ఇచ్చిన భార్యను 48 సంవత్సరాల తన తండ్రి కొన్నేళ్ల క్రితం తిరిగి పెళ్లి చేసుకున్నాడని, సంబాల్ ప్రాంతంలో కలిసి జీవితం సాగిస్తున్నాడని తెలిసింది. 

అంటే.. భార్య స్థానంలో ఉన్న మహిళ ఇప్పుడు ఆ వ్యక్తికి సవతి తల్లిగా మారింది. ఇది తెలిసి ఆ కొడుకు షాక్ అయ్యాడు. అనంతరం బిసౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తండ్రీకొడుకుల మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే సవతి తల్లిగా మారిన ఆ మాజీ భార్య మాత్రం తనకు రెండో భర్తతోనే సుఖంగా ఉందని, మొదటి భర్త వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని పోలీసులకు తెలపింది.. ఇది చదివి మీకు దిమ్మతిరిగింది కదూ… 

Leave a Comment