స్మార్ట్ ఫోన్ పోయిందని.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయి ఉన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోతే జీవితమే లేదన్నట్లు ఊహించుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్ పోయిందన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విచిత్ర ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు బీహార్ లోని పూర్నియా జిల్లాకు చెందిన ఓ మహిళకు తన సెల్ ఫోన్ తో మంచి అటాచ్ మెంట్ ఉంది. ఎప్పుడు సెల్ ఫోన్ తో గడిపేది. ఆ మహిళ భర్త బిట్టు సింగ్ స్వగ్రామం బనమ్నాఖికి వెళ్లాడు. ఆ సమయంలో బిట్టకు భార్య వేరే నెంబర్ తో ఫోన్ చేసి తన మొబైల్ మిస్సయిందని చెప్పింది. ఆ సమయంలో ఆమె కుమారుడు ఇంటి డాబాపై ఆడుకుంటున్నాడు. 

అయితే కొడుకు టెర్రస్ పై నుంచి కిందికి వచ్చి చూడగా తల్లి ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బిట్టు బనమ్నాఖి నుంచి పూర్నియాకు వచ్చాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాకి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అది హత్యా లేక ఆత్మహత్యా అనేది పోస్ట్ మార్టం తర్వతా మాత్రమే నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. తన భార్యకు మొబైల్ ఫోన్ తో మంచి అటాచ్ మెంట్ ఉందని, అది కనిపించడం లేదని తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని బిట్టు చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త అందరినీ షాక్ కి గురిచేస్తోంది.   

Leave a Comment