కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి..!

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి(34) మృతి చెందారు. ఆశిష్ కు రెండు వారాల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయన్ను గుర్గావ్ లోని మేదాంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన మరణించినట్లు సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్ ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు.’ అంటూ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్ ఓ ప్రముఖ వార్తా పత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  

ప్రముఖుల సంతాపం..

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గారి కుమారుడి మరణ వార్త నన్ను కలిచివేసింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను – ఏపీ సీఎం జగన్

సీతారాం ఏచూరి కుమారుడు ఆశిస్ ఏచూరి మృతిపట్ల ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.  – ప్రధాని మోడీ

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి తుదిశ్వాస విడిచారనే విషయం దిగ్భ్రాంతిని కలిగించింది. కరోనా మహమ్మారి యువ జర్నలిస్ట్ ఆశిష్ ని పొట్టనబెట్టుకోవడం దురద్రుష్టకరం. చిన్న వయస్సులోనే మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ విషాద సమయంలో సీతారాం ఏచూరి మనో నిబ్బరంతో ధైర్యంగా ఉండాలి. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.  – పవన్ కళ్యాణ్

Leave a Comment