కల్లు తాగిన సింగర్ సునీత..!

ప్రస్తుతం సింగర్ సునీత తాటి కల్లు గ్లాసుతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ మహిళా దినోత్సం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం సింగర్ సునితను ఆహ్వానించారు. ఆ కార్యక్రమం ఓ రిసార్టులో జరిగింది. కాగా, ఆ రిసార్ట్ లో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. 

ఆ తాటి చెట్ల నుంచి గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు. ఈ క్రమంలో సింగర్ సునీతతో పాటు తోటి కళాకారులు కూడా కల్లును గ్లాసులతో తాగారు. ప్రస్తుతం సునీత కల్లు తాగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇటీవల సింగర్ సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తన సెకండ్ ఇన్నింగ్స్ చాలా సంతోషంగా గడుపుతున్నట్లు సునీత ఇటీవల చెప్పింది.  

 

Leave a Comment