ఫేక్ న్యూస్ పై ఫ్యాక్ట్ చెక్.. వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏది నిజమో? ఏది అబద్ధమో? నమ్మలేకపోతున్నాం.. కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ factcheck.ap.gov.in అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్ సైట్ ను ప్రారంభించి, దాని ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇటీవల రాష్ట్రంలో ఓ వర్గం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. దీంతో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ దోహదపడుతుంది. 

వాస్తవాలను అందించడంతో పాటు వెట్ సైట్ లో ఫేక్, ఫ్యాక్ట్ అనే ప్రత్యేక ఫీచర్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్ ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ వెబ్ సైట్లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మోదని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 

ఫ్యాక్ట్ చెక్ చేసుకునేందుకే వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచచామని, సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. @FactcheckAPGov ట్విట్టర్ అకౌంట్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.  

Leave a Comment