నలుగురితో లేచిపోయిన యువతి… లక్కీ డ్రా తీసి ఒకరిని పెళ్లి చేశారు..!

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల విచిత్ర వివాహం జరిగింది. నలుగురిలో లేచిపోయిన యువతికి లక్కీ డ్రా తీసి ఒకరిని పెళ్లి చేశారు. ఏం జరిగిందంటే.. యూపీలో రాంపూర్ జిల్లాలోని అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిని నలుగురు యువకులు ప్రేమించారు. ఆ యువతి కూడా ఎవరినీ కాదనకుండా నలుగురిని ప్రేమించింది.

తర్వాత  ఆ యువతి నలుగురితో లేచిపోయింది. ఎలాగోలా వారి ఆచూకి కనుక్కోని వారిని గ్రామానికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే గ్రామస్థులు రంగ ప్రవేశం చేసి ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి పెళ్లి చేద్దామని ఒప్పించారు. 

ఇక్కడే అసలు ట్వీస్టు ఉంది. గ్రామ పెద్దలు నలుగురు అబ్బాయిల్లో ఎవరంటే ఇష్టమని అమ్మాయిని అడిగారు. దీనికి అమ్మాయి ఏ మాత్రం తడుముకోకుండా నలుగుతూ ఇష్టమే అని చెప్పింది. ఆ తర్వాత పెద్దలు నలుగురు అబ్బాయిలను పిలిచి, మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికి పెళ్లి చేస్తామని చెప్పారు. 

ఆ నలుగురు యువకులు దానికి ఒప్పుకోలేదు. దీంతో గ్రామ పెద్దలు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆలోచించి వారి పెళ్లి చేసేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నలుగురు యువకుల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. లక్కీ డ్రాలో విజేతగా నలిచిన వారికి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. 

  

 

Leave a Comment