మహాలయ అమావాస్య రోజున అకాశంలో శివలింగం దర్శనం..!

మహాలయ అమావాస్య రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొండయ్య గూడెంలోని రామాలయానికి వెళ్తున్న పూజారి శ్రీనివార శాస్త్రి ఆకాశంలో శివలింగం ఆకారంలో మబ్బులు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 

ఇంతటి మహాద్భుతం కనబడితే ఎవరైనా ఊరుకుంటారా.. ఈ మహాద్భుతాన్ని తన కమెరాలో బంధంచి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. మహాలయ అమావాస్య రోజున తనకు ఆకాశంలో శివలింగం దర్శనమివ్వడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస శాస్త్రి నేరేడుచర్ల మండలంలోని సోమప్ప సోమేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Leave a Comment