మైనర్ బాలికపై అత్యాచారం కేసులో.. కామాంధుడికి జీవితఖైదు..!

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎంఎస్ జే కోర్టు తీర్పు ఇచ్చింది. గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎర్రగడ్డలోని ఛత్రపతి శివాజీ నగర్ కు చెందిన నవీన్ అనే యువకుడు అభం శుభం తెలియని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడికి కోర్టులో హాజరుపరిచారు. 

విచారణలో పోలీసులు నిందితుడ నవీన్ కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను న్యాయమూర్తి ముందుంచారు. వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి నవీన్ కు జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు తీర్పుతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

Leave a Comment