వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు.. విద్యార్థులంతా సేఫ్..!

మహాబూబ్ నగర్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ బస్సు వదరనీటిలో చిక్కుకుంది. విద్యార్థులంతా క్షేమంగా బయటపడ్డారు.. ఇటీవల కురిసిన వర్షాలకు మాచన్ పల్లి – కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీరు భారీగా చేరింది. ఈక్రమంలో రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తున్న స్కూల్ బస్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుంది. 

దాదాపు సగభాగం వరకు బస్సు నీటిలో ఉండిపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు వరదనీటిలో చిక్కుకుపోవడంతో విద్యార్థులంతా ఆర్తనాదాలు చేశారు. స్థానికుల సహాయంలో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బస్సును ట్రాక్టర్ సాయంతో తీశారు. 

 

Leave a Comment