టీఆర్పీలోనూ నీకు ‘సరిలేరు’

మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ  ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంవ మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ చిత్రం టాలీవుడ్ లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఉగాది సందర్భంగా బుల్లితెరపై సరిలేరు నీకెవ్వరు మొదటి ప్రీమియర్ పదర్శితం కాగా..23.4 టీఆర్పీ రేటింగ్ ను సాధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం కావడంతో మంచి టీఆర్పీని సాధించింది. దీంతో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయడంతో పాటు..కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా బాహుబలి 2 మొదటి ప్రీమియర్ సమయంలో 22.70 టీఆర్పీని సాధించగా ఇప్పటి వరకు అదే టాప్. 

ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తరువాతి ప్రీమియర్ సమయంలో ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని సీన్ లను యాడ్ చేయాలని అనుకుంటున్నారట. 

Leave a Comment