ఒవైసీ, మాయావతిలకు భారతరత్న ఇవ్వాలి : శివసేన ఎంపీ

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంసాధించిన సంగతి తెలిసిందే. యూపీలో అందరి అంచనాలను తారుమూరా చేస్తూ రికార్డు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషన్ లేదా భారతరత్న అవార్డులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. 

యూపీలో బీజేపీ ఘన విజయం సాధించిందని, ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం అని రౌత్ పేర్కొన్నారు. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయని, 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయని తెలిపారు. మాయావతి, ఒవైసీలు బీజేపీ విజయానికి దోహదపడ్డారని, వారికి పద్మవిభూషన్, భారతరత్న అవార్డులు ఇవ్వాలని సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేశారు.     

Leave a Comment