సమాజానికి సమంత సూటి ప్రశ్న?.. భావోద్వేగంతో సామ్ పోస్ట్..!

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య విడాకులు హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ల విడాకులపై ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ వీరి విడాకులకు గల అసలు కారణాన్ని మాత్రం ఈ జంట వెల్లడించలేదు. కాగా సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమాచానికి సూటి ప్రశ్న వేశారు. 

‘మహిళలను ప్రశ్నిస్తూ ఉండే సమాజం. మగవాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా’ అంటూ ఓ కొటేషన్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం తప్పంతా సమంతదే అన్నట్లు కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంత ఎంతో భావోద్వేగంతో ఈ పోస్టు పెట్టారు. ఒక జంట విడిపోతే తప్పు అంతా మహిళదే అన్నట్లు సమాజం వేలెత్తి చూపడాన్ని సమంత తన ప్రశ్నతో నిలదీసినట్లు ఉందని చాలా మంది భావిస్తున్నారు.  

Leave a Comment