విడాకుల తర్వాత సమంత తొలి పోస్టు.. సోషల్ మీడియాలో వైరల్..!

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. వారు విడాకులు తీసుకున్న తర్వాత నెటిజన్లు వారి సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ పెట్టారు. విడాకుల గురించి ఏదైన చెబుతారా అంటూ ఆసక్తిగా వారి సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతున్నారు.. వీరు ఏ కొటేషన్ పెట్టినా, ఏదీ పోస్ట్ చేసినా దానిపై చర్చ జరుగుతోంది. 

విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎలాంటి పోస్టులు చేయలేదు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్ లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు’ అంటూ ఇన్ స్టా స్టోరీలో సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరోవైపు సమంత ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాల్లో ఎస్ అనే ఆంగ్ల అక్షరం ఉండేది. ఇప్పుడు దానిని మార్చేసింది. మళ్లీ సమంత అనే పేరును రాసింది. అయితే సమంత ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కాని ఫేస్ బుక్ లో మాత్రం యాక్టివ్ గా ఉండరు. అందుకే ఇంకా సమంత ఫేస్ బుక్ ఖాతాలో సమంత అక్కినేనిగానే ఉంది. అయితే సామ్-చైతు విడిపోవడానికి గల కారణాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు.. ఫ్యాన్స్ మాత్రం వారు విడిపోవడానని జీర్ణించుకోలేకపోతున్నారు.  

Leave a Comment