ఏంటీ విమానం రోడ్డు మీదకు వచ్చిందనుకుంటున్నారా? అవును నిజమే విమానం రోడ్డు మీదకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఢిల్లీ-గుర్గావ్ హైవేపై ఒక విమానం వంతెన కింద ఇరుక్కుంది. రోడ్డుకు ఒకపక్క వాహనాలు వెళ్తుండగా, మరోవైపున వంతెన కింద రెక్కులు లేని వామానం కనిపించింది. ప్రస్తుతం ఈ విమానం ఫొటోలు..వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఇంతకు ఏంజరిగిందంటే.. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పాత విమానం స్క్రాప్ కింద విక్రయించారు. దాన్ని కొనుగోలు చేసిన యజమాని భారీ ట్రాలీలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియాకు ఎటువంటి సంబంధం లేదన చెప్పింది. తాము విక్రయించిన పాత విమానాన్ని కొన్న వ్యక్తి ట్రాలీలో తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్ అయిందని వివరించింది. ఇది తుక్కు కింద చేసిన విమానమని, దానిని వాహనం ద్వారా తరలిస్తున్నప్పుడు డ్రైవర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందంట వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location?
The competition starts now👇 pic.twitter.com/pukB0VmsW3— Ashoke Raj (@Ashoke_Raj) October 3, 2021