మెగా ఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్.. తొలిసారిగా బయటకు..!

రెండు నెలల క్రితం వినాయక చవితి రోజున మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి తేజ్ ఛాతీ, తల, కాళ్లకు గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. 35 రోజుల పాటు చికిత్స తీసుకున్న సాయిధరమ్ తేజ్ విజయదశమి రోజున డిశ్చార్జ్ అయ్యారు. 

సాయి ధరమ్ తేజ్ కోలుకున్న తర్వాత మీడియాకు కనిపించలేదు. కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. కాగా, దీపావళి పండుగ నాడు సాయి తేజ్ తొలిసారిగా కనిపించాడు. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ వేదికగా మెగాఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోను ట్విట్టర్ షేర్ చేశారు. సాయి తేజ్ భుజంపై చిరంజీవి చేయి వేసి ఉన్నారు. ‘అందిరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ’.. అని చిరంజీవి ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, పవన్ కొడుకు అకీరా నందన్ లు ఉన్నారు. 

Leave a Comment