సామాన్యులపై పిడుగు.. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు..

గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు.. ఒక్కో సిలిండర్ పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. 

 ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.594 నుంచి రూ.644 కు చేరింది. కాగా దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో విధంగా ఉన్నాయి దీంతో సిలిండర్ ధరల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా, తాజా పెంపుతో రూ.696.50కు చేరే అవకాశం ఉంది. 

Leave a Comment