దురదృష్టం అంటే ఇదేనేమో.. చదువు కోసం దాచుకున్న రూ.25 లక్షలు కళ్ల ముందే మంటల్లో కాలిపోయాయి..!

కుమారుడి చదువు కోసం పొలం అమ్మి డబ్బులు సిద్ధం చేసింది. పొలం అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను భద్రంగా పెట్టెలో దాచుకుంది. కాని ఆమెకు అగ్నిప్రమాదం రూపంలో దురదృష్టం వెంటాడింది. కళ్ల ముందే రూ.25 లక్షల మంటల్లో కాలిపోయాయి. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

జిల్లాలోని చింతలపూడి మండలం గురుభట్లగూడెంకు చెందిన కాళ్ల కృష్ణవేణి, కుమారుడు మహేష్ కలిసి నివాసముంటుంది. ఈక్రమంలో ఓ రోజు వాళ్ల ఇంటి పక్కన ఉన్న గడ్డివామి నుంచి మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఇంటికి కూడా వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వీరు అప్రమత్తమై బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల డబ్బుతో పాటు బంగారం పూర్తిగా కాలిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  తన కుమారుడు మహేష్ అగ్రికల్చర్ బీఎస్సీ చదవడానికి పొలం అమ్మి రూ.25 లక్షలు సిద్ధం చేసుకున్నారు. మంటల్లో మొత్తం డబ్బు కాలిపోవడంతో వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకు చదువు పరిస్థితి ఏంటని ఆదేదన వ్యక్తం చేశారు.  

 

Leave a Comment