వానలో బైక్ పై వెళ్తుండగా.. పిడుగు పడి తల్లి, కుమారుడు మృతి..!

పెళ్లయిన చాలా కాలానికి బాబు పుట్టాడు. ఆ బాబును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ బాబు ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి వెళ్లి బాబును చూపించుకుని తిరిగి వస్తున్నారు.. అంతలోనే పిడుగు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. బైక్ పై వస్తుండగా పిడిగు పడి తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని సీసీసీ నస్పూర్ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో అందె వెంకటేశ్, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి  వివాహమైంది. చాలా కాలం తర్వాత కుమారుడు పుట్టాడు. కుమారుడు శ్రీయాన్ కు ఇప్పుడు 18 నెలలు.. శ్రీయాన్ కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బైక్ పై తిరిగి వస్తుండగా ఫ్లై ఓవర్ బ్రిడ్రిపైకి రాగానే పిడుగుపడింది. ముగ్గురు కిందపడిపోయారు. మౌనిక(28), శ్రీయాన్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేష్(32) తీవ్రగాయాలయ్యాయి. అతనికి చికిత్స కోసం కరీనంగర్ కు తరలించారు..వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ దృశ్యాలు అందరిని కలచివేశాయి. 

Leave a Comment