తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టను భంగం కలిగించేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ దినపత్రికపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు.
టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలపై బుధవారం తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామన్నారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. టీటీడీ నిధుల వినియోగంపై ప్రభుత్వంతో కాకుండా కాగ్ తో విచారణ జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.
గత ఐదేళ్లలో టీటీడీ ఖర్చు పెట్టిన నిధులన్నింటినీ కాగ్ విచారణ జరపాలని కోరారు. చంద్రబాబు హయాంలో అక్రమాలు వెలికితీయాలని చెప్పారు. ఓ పత్రిక మతాల మధ్య చిచ్చు పెట్టేలా కథనాలు ప్రచురించిందని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సంహించేది లేదని అన్నారు.