ఓ వ్యక్తిని భుజాలపై మోసి కాపాడిన లేడీ ఎస్సై.. వైరల్ వీడియో..!

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర రాజధాని చెన్నైలో భాయనక వాతావరణ నెలకొంది. జనజీవనం పూర్తి స్తంభించింది. ప్రభుత్వం, అధికారులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో లేడీ పోలీస్ ఇన్ స్పెక్టర్ రాజేశ్వరీ చేసిన పని అందరితో ప్రశంసలు అందుకుంటోంది.. బుధవారం ఉదయం చెన్నైలోని టీపీ సత్రం ప్రాంతంలో ఓ వ్యక్తిని కాపాడింది రాజేశ్వరీ.. 

అనారోగ్యంతో శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువకుడిని తన భుజాలపై వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లిన తీరు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫస్ట్ కారులో ఎక్కించేందుకు ప్రయత్నించింది. కానీ ఎక్కించడం సాధ్యం కాలేదు. దీంతో అక్కడ నుంచి ఎదురుగా వస్తున్న ఆటో దగగ్గరకు తీసుకెళ్లి ఆటో ఎక్కించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చేసిన పనికి అందరు శభాష్ మేడం, సెల్యూట్ మేడమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment