లాక్ డౌన్ ఎగ్జిట్ వ్యూహంపై సమీక్ష

ప్రస్తుతం రాష్ట్రంలో 290 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో అనుసరించాల్సిన ఎగ్జిట్‌ వ్యూహంపై సీఎంకు ప్రతిపాదనలను అధికారులు వివరించారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

  • 75 కంటైన్మెంట్ క్లస్లర్లలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదుకాలేదని, వాటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి. 
  • కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్ల  కంటైన్‌మెంట్‌ ఏరియా, 500 మీటర్ల బఫర్‌ కలుపుకుని 1 కి.మీ పరిధిలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌. ఇక్కడ ఆంక్షలు కఠినంగా కొనసాగుతాయి.
  • మరొక 103 క్లస్టర్లలో (10, అంత కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు) 200 మీటర్లు మేర కంటైన్‌మెంట్, 200 మీటర్ల బఫర్‌ ఏరియాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఆపరేషన్స్‌ కొనసాగుతాయి.
  • 90 డార్మంట్‌ క్లస్టర్లలో (గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాలు) 200 మీటర్ల కంటైన్‌మెంట్‌ ఏరియా అమలు. కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తర్వాత ఆ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు.
  • ఎగ్జిట్‌ ప్లాన్‌లో భాగంగా థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థలు.. వీటిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ఎలా కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు (ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

వలస కూలీలపై చర్చ..

ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి, రాష్ట్రం మీదుగా ఒడిశా, జార్ఖండ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు సుదీర్ఘ దూరం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు, ఘటనలపై సమావేశంలో చర్చించారు.  చాలా మంది అవగాహన లేక, శ్రామిక రైళ్ల కోసం నిరీక్షించలేక నడుచుకుంటూ వెళ్తున్నారన్నారని అధికారులు తెలిపారు. వ్యవస్థీకృతంగా ఉంటే ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారిని వారి స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

జూలై 1 నాటికి ప్రతి పీహెచ్‌సీకీ ఒక బైక్‌..

  • టెలీమెడిసిన్‌ను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌.
  •  జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశిం
  •  అదే రోజు 108,104 అంబులెన్స్‌లు 1060 ప్రారంభం.
  •  టెలిమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌డెలివరీ చేయడానికే బైక్‌ వినియోగం. 
  • ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి మార్కెట్‌ ఇంటెలిజెన్స్, ప్రొక్యూర్‌మెంట్‌కోసం ఉద్దేశించిన  యాప్‌ అందుబాటులోకి రావాలన్న ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Leave a Comment