పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించుకుని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఇద్దరు పిల్లలను రేణు దేశాయ్ తన వద్దే ఉంచుకుని వారి బాధ్యతలను చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడు పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయం గడుపుతుంటారు.
తాజాగా రేణు దేశాయ్ ఓ అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా, కుమార్తె ఆద్యను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్నాడు. ‘ కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాలి. అవి మీ ఫోన్ ఫొటో ఆల్బమ్ లో ఉండలేవు. నా ఫోన్ కెమెరాలో నేను బంధించిన కొన్ని అరుదైన క్షణాలు’ అంటూ రేణు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram