పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్లూ జులై 10వ తేదీ నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించినుంది. ప్రతి పేపర్ కు 100 మార్కులు ఉంటాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. 

పరీక్షల షెడ్యూల్ ఇదే ..

 

జులై 10ఫస్ట్ లాంగ్వేజ్
జులై 11సెకండ్ లాంగ్వేజ్
జులై 12ఇంగ్లీషు
జులై 13మ్యాథ్స్
జులై 14జనరల్ సైన్స్
జులై 15సోషల్ స్టడీస్

 

Leave a Comment