పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్లూ జులై 10వ తేదీ నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహించినుంది. ప్రతి పేపర్ కు 100 మార్కులు ఉంటాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
పరీక్షల షెడ్యూల్ ఇదే ..
జులై 10 | ఫస్ట్ లాంగ్వేజ్ |
జులై 11 | సెకండ్ లాంగ్వేజ్ |
జులై 12 | ఇంగ్లీషు |
జులై 13 | మ్యాథ్స్ |
జులై 14 | జనరల్ సైన్స్ |
జులై 15 | సోషల్ స్టడీస్ |