డెబిట్, క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్..

డెబిట్, క్రెడిట్ కార్డుల సైబర్ మోసాలను నియంత్రించడానికి, కార్డుల భద్రతను మరింత పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ ను జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సెక్యూరిటీ, కార్డు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ భద్రతను మరింత పఠిష్టంగా చేయడం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జనవరిలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాతాదారులు వారి డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే, కార్డులను రద్దు చేయాలని ఆర్బీఐ ఇప్పటికే కార్డు జారీ సంస్థలకు, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుతం ఉన్న కార్డులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కార్డు జారీ చేసిన సంస్థలకు పూర్తి అధికారం ఉంటుంది. కార్డుపై ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు ఏ వ్యక్తి అయినా కార్డు ఉపయోగించకపోతే, కార్డు సర్వీసులను రద్దు చేయాలని, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్10(2) నిబంధన ప్రకారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 

కొత్త రూల్స్ ప్రకారం ఇక ముందు కస్టమర్లు తమ కార్డులను సంబంధిత ఏటీఎంల ద్వారా స్విచ్ ఆన్, ఆఫ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలను మొబైల్, అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా పొందవచ్చు. కార్డు స్టేటస్ కు సంబంధించిన ఏమైనా మార్పులు ఉంటే ఈ విషయం గురించి ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా కస్టమర్లను హెచ్చరిస్తుంది.

Leave a Comment