కరోనా ఎఫెక్ట్ – ఆన్ లైన్ లో నిఖా..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మనుషుల జీవితాల్లో విపరీతమైన మార్పులకు కారణమవుతోంది. మామూలుగా జరిగే చాలా పనులను ఇతరాత్రా మార్గాల ద్వారా చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇందుకు తాజా ఉదాహరణ..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఆన్ లైన్ నిఖా..

ఆన్ లోన్ లో పెళ్లి ఏంటి అనుకుంటున్నారా..ఇది నిజం..వరుడు విదేశాల నుంచి రావాల్సి ఉండడం, వధువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండిపోవడం, ముహూర్తం దగ్గర పడడంతో పెద్దలు ఇలా డిసైడ్ చేశారు. విదేశాల నుంచి ప్రయాణాలను నియంత్రించిన నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నిఖా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. దుబాయ్ లో ఉన్న వరుడు రావాడానికి ఇబ్బంది, ఒక వేళ వచ్చినా..క్వారంటైన్ ఆస్పత్రిలో నెగెటివ్ గా తేలితేనే వివాహానికి హాజరయ్యే పరిస్థితి. అందుకే వరుడు అక్కడే దుబాయ్ లో ఉండిపోయాడు. 

కరోనా ఎఫెక్టుతో వరుడు రాలేకపోవడంతో మరో ప్రత్యామ్నాయం ఆలోచించారు రెండు కుటుంబాల పెద్దలు. ముస్లిం సంప్రదాయంలో ఖుబూల్ పదానికి ఉన్న ప్రాముఖ్యతను వినియోగించుకుని ఆదివారం రాత్రి ముహూర్తానికే ఆన్ లైన్ లో నిఖా నిర్వహించాలని తలపెట్టి మత పెద్దలను సంప్రదించారు. వారు కూడా అంగీకరించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ఉన్న వధువుకు, దుబాయ్ లో వరునితో ఆన్ లైన్ లో నిఖా తంతును ముగించారు.  

Leave a Comment