Krishna Patnam Medicine : మళ్లీ క్షీణించిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం..!

 నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు ప్రస్తుతం హాట్ టాపిక్.. ఆనందయ్య అందజేసే ఈ మందు కరోనా రోగులను ఇట్టే నయం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం.. ఇంకేముందు సోషల్ మీడియా పుణ్యమా అంటూ వేలాది మంది రోగులు కృష్ణపట్నంకు పరుగులు పెట్టారు. అక్కడ మందు వేసుకున్న వారు తమకు ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయంటూ వీడియోలు తీసి పెట్టారు..

అయితే ఇలా మందు తీసుకున్న వారు ఆరోగ్యంగానే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈరోజు ఆయన ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయాయి. దీంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ పసరు మందు కొందరిలో పనిచేయట్లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయూష్, ఐసీఎంఆర్ అనుమతులు వచ్చే వరకు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి బ్రేక్ పడింది..

క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..

ఇదిలా ఉంటే ఆనందయ్య ఆయుర్వేద మందును కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఆయుర్వేద మందు విక్రయాలు జరుపుతున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్ మార్కెట్ లో రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు..

 

Leave a Comment