ఇద్దరు పిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి..!

కంటికి రెప్పాలా కాపాడాల్సిన తల్లే తన పిల్లలను కడతేర్చింది. ఉరేసి వారిని హత్య చేసింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన పూలేటి రాముకు 11 ఏళ్ల క్రితం సీతానగరానికి చెందిన లక్ష్మీ అనూషతో వివాహమైంది. వీరికి కుమార్తె చిన్మయి(8), కుమారుడు మోహిత్ శ్రీసత్య(5) ఉన్నారు. 

కుటుంబ కలహాలతో రాము గతంలో సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి లక్ష్మీ తన పిల్లలతో మల్లయ్యపేటలో నివాసం ఉంటోంది. ఈక్రమంలో తన ఇద్దరు పిల్లలను లక్ష్మీ ఉరి వేసి హత్య చేసింది. ఈ విషయాన్ని తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చి పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పిల్లలు మృతి చెందారని వైద్యులు తెలిపారు. తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక హత్యచేశానని లక్ష్మీ చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, వేరే కారణంతోనే హత్య చేసిందని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment