ఆరో తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్.. ఏం చెప్పారంటే..!

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం స్టాలిన్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఆరో తరగతి విద్యార్థినికి సీఎం స్టాలిన్ ఫోన్ చేశారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలను నవంబర్ 1 నుంచి ఓపెన్ చేస్తున్నట్లు ఆ అమ్మాయికి చెప్పారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు టీచర్ సూచనలు పాటించాలని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆ విద్యార్థినికి సూచించారు.

తమ పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారని తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న హొసూరులోని టైటాన్ టైన్ షిప్ కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా గతంలో లేఖ రాసింది. ఆ లేఖలో తన ఫోన్ నెంబర్ రాసింది. చిన్నారి రాసిన లేఖను సీఎం స్టాలిన్ చదివి ఆ విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం తనకు ఫోన్ చేయడాన్ని నమ్మలేకపోతున్నానని చిన్నారి ప్రజ్ఞా తెలిపింది.  

 

Leave a Comment