అడుక్కోవడానికి వెళ్లాలి.. సెలవివ్వండి.. వైరల్ అవుతున్న లీవ్ లెటర్..!

మధ్యప్రదేశ్ లో ఓ డిప్యూటీ ఇంజనీర్ పెట్టిన లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయండి’ అంటూ రాజ్ కుమార్ యాదవ్ అనే డిప్యూటీ ఇంజనీర్ తన పైఅధికారులను అభ్యర్థించాడు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నావు కదా.. అడుక్కోవడం ఎందుకు అంటూ అధికారులు ప్రశ్నించారు. దీనికి ఆ ఇంజనీర్ చెప్పిన సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇంతకు ఏం చెప్పాడంటే..

‘నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అందుకు భిక్షాటన చేయానుకుంటున్నాను. మతపరమైన అన్వేషన్ చేస్తూ నాలోని అహాన్ని చెరిపేయాలనుకుంటున్నాను. ఆత్మశోధన చేయాలనుకుంటున్నాను. గతజన్మలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఆర్ఎస్ఎష్ చీఫ్ మోహన్ భగవత్, నేను ముగ్గురు మంచి స్నేహితులు. మేము మహాభారత కాలంలో స్నేహితులం. ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడుగా, మోహన్ భగవత్ శకుని మామగా ఉన్నారు. గతజన్మలో వీరు ఇద్దరూ నాకు ప్రాణ స్నేహితులు. అంతేకాదు ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు గతజన్మ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీద పారాయణం చేయాలని భావిస్తున్నాను’ అంటూ రాజ్ కుమార్ తన లేఖలో వివరించాడు.

ఈ లేఖ చదివిన అధికారులు షాక్ అయ్యారు. అంతేకాదు అతనికి ఫన్నీగా రిప్లయ్ కూడా ఇచ్చారు. డిప్యూటీ ఇంజనీర్  మీరు మీ అహాన్ని చెరిపేయాలనుకోవడం సంతోషకరం. మీ లక్ష్యాన్ని సాధించడంలో తాము సహకరిస్తాం. ఈ అహాన్ని దాని మూలల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరమని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment