తండ్రి సమాధి వద్దే పునీత్ రాజ్ కుమార్త అంత్యక్రియలు..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి.  బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు చేశారు.  పునీత్ కు మగపిల్లలు లేకపోవడంతో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ తలకొరివి పెట్టాడు. కర్ణాటక సీఎం సహా అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పునీత్ రాజ్ కుమార్ కన్నీటి వీడ్కోలు పలికారు. 

అంతకు ముందు తెల్లవారుజామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ మధ్య పునీత్ అంతిమయాత్రం నిర్వహించారు.పునీత్ ను చివరిసారిగా చూసేందుకు వేలాది మంది అభిమానులు కరోనాని సైతం లెక్కచేయకుండా వచ్చారు. అంత్యక్రియలు ప్రారంభమైన సమయంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పునీత్ పార్థివదేహానికి సెల్యూట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.. పునీత్ అకాల మరణం కోట్లాది మంది అభిమానులు, రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.  

 

Leave a Comment