ఇది బైకా లేదా విమానమా?..పెట్రోల్ రేట్లు పెరగడంతో బైక్ పై 9 మంది కూర్చోబెట్టుకుని..వైరల్ వీడియో..!

ప్రస్తుతం పెట్రోల్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఇంధన ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పెంచడమే తప్ప.. తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈనేపథ్యంలో ఓ వ్యక్తి వినూత్న ఐడియా చేశాడు. తన ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే సారి బైక్ తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచినప్పుడు.. ప్రజలు కొత్త జుగాడ్ విమానాన్ని తయారు చేశారు. అంటూ ట్వీట్ చేశారు. 

ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతున్నాడు. ఆ బైక్ కు ఇరువైపుల చెక్క పలకలను రెక్కల లాగా జత చేశాడు. ఆ చెక్క పలకలపై ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఏకంగా తొమ్మిది మందిని కూర్చోబెట్టుకుని రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నాడు. ఆ చెక్కలపై కూర్చున్న వారి బరువుతో బైక్ ను బ్యాలెన్స్ చేస్తూ.. విమానంలో వెళ్లినట్లు వెళ్తున్నాడు. బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు దానిపై ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక్కరు కూడా హెల్మెట్ ధరించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment