చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు..!

 

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.  తమ వార్డుల్లో పనులు జరగడం లేదంటూ వైసీపీ కౌన్సిలర్లు పాలకవర్గాన్ని నిదీయడంతో ఈ వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు బూతులతో తిట్టుకుంటూ.. చెప్పులతో కొట్టుకున్నారు. 

ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాష తమ వార్డులో పనులు జరగడం లేదని సమస్యను లేవనెత్తారు. పాలకవర్గాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. 

ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన సభ్యులు రెండుగా విడిపోయి సమావేశం హాలులోనే చెప్పులతో కొట్టుకున్నారు. బయటకు వచ్చి కూడా గొడవ పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Leave a Comment