నడి రోడ్డుపై ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధం..

ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధమైన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నడి రోడ్డుపై ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధమవడంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు దగ్ధమైంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. తొలుత బస్సు ఇంజిన్ లో నుంచి మంటలు వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేవారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Comment