జనసేనలోకి పృథ్వీ రాజ్.. ఎమ్మెల్యేగా పోటీ ఎక్కడ అంటే?

ప్రముఖ సినీ నటుడు, 30 ఇయర్స్ ఇడస్ట్రీ పృథ్వీ రాజ్ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. జనసేన సీనియర్ నాయకులు, నటుడు నాగబాబుతో భేటీ అయిన ఆయన జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం జగన్ ఆయనకు ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. 

అయితే ఆ పదవి ఎక్కువ కాలం నిలవలేదు. ఓ మహిళతో రాసలీలల వీడియో లీక్ కావడంతో ఆయన్ను పదవి నుంచి తొలగించారు. వైసీపీ నుంచి కూడా ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ రాజ్ వైసీపీ మీద ఆరోపణలు చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని టాక్ వచ్చింది. 

తాజాగా నాగబాబుతో కలిసిన తర్వాత జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష పూర్తి అయిన తర్వాత ఆయన సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఆయన సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Leave a Comment