ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : ఒవైసీ

ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ షెడ్యుల్ ఖరారైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తు ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరవుతున్నారని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.

లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి..ఇప్పుడు దానిని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామమందిరం భూమి పూజకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్ గుంపు ధ్వంసం చేసిందని,  చెప్పారు. ఆ ఘటనను మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. లౌకికతత్వమనే రాజ్యాంగంలో ముఖ్య భాగమన్నారు. దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవుపలికారు. 

 

Leave a Comment