‘కాశీలో నా చావు కోసం ప్రార్థిస్తే సంతోషమే’.. ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు..!

ఎవరైనా తమ చివరి రోజుల్లో వారణాసిలోనే గడపాలనుకుంటారు.. ఇదే వారికి సరైన ప్రాంతం అని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. వారణాసిలో జరిగిన ఎన్నిక ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ అఖిలేష్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. 

రాజకీయ ప్రత్యర్థులు తన చావును కోరుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాలను కొందరు దిగజారుస్తున్నారని, కాశీలో తన చావు కోసం ప్రార్థించారని అన్నారు. కాశీలో తన చావు కోసం ప్రార్థిస్తే సంతోషమే అని తెలిపారు. తన చావు వరకు తాను కాశీని వదలని అని, కాశీ ప్రజలు కూడా తనను విడిచిపెట్టరని మోడీ పేర్కొన్నారు. 

గతంలో ప్రధాని మోడీ వారణాసిలో పర్యటించినప్పుడు.. ఒక నెల కాదు.. రెండు మూడు నెలల వరకు వారు ఇక్కడే ఉండొచ్చు. వారికి ఇదే సరైనా ప్రాంతం. ఎందుకంటే ఎవరైనా తమ చివరి రోజులు ఇక్కడే గడపాలనుకుంటారు.. అని అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో అఖిలేష్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు.  

 

Leave a Comment