పీవీ సింధుతో ఐస్ క్రీమ్ తిన్న ప్రధాని మోడీ..!

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో కలిసి ప్రధాని మోడీ ఐస్ క్రీమ్ తిన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లతో పాటు పలువురు భారత క్రీడాకారులకు ప్రధాని మోడీ సోమవారం తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో కలిసి ప్రధాని మోడీ ఐస్ క్రీమ్ తిన్నారు. 

టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో పతకంతో తిరిగి వచ్చాక ఐస్ క్రీమ్ తిందామని సింధుతో ప్రధాని మోడీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోడీ సింధుతో ఐస్ క్రీమ్ తిన్నారు.  

సోమవారం అథ్లెట్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ ఫొటో దిగారు. వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తనకు చూర్మ వంటకం ఇష్టమని నీరజ్ చెప్పారు. ఆ వంటకాన్ని ఈ కార్యక్రమం కోసం ప్రధాని చేయించారు. 

ఇక పీవీ సింధూతోనూ కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి పీవీ సింధు రియో పతకాన్ని కూడా తీసుకొచ్చింది. రెండు మెడల్స్ మెడలో వేసుకుని ప్రధాని మోడీతో సింధు ఫొటో దిగింది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం ఏడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే…

Leave a Comment