పూరీ ఆలయంలో పూజారీ దారుణం.. పూజ కోసం వచ్చిన మైనర్ బాలికపై..!

దేశంలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. చివరికి ఆలయాల్లోనూ ఆడ పిల్లలను వదలట్లేదు కామాంధులు.. తాజాగా దైవ దర్శనం కోసం వచ్చిన 12 ఏళ్ల బాలికపై ఆలయంలో పనిచేసే ఓ పూజారీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూజారీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ కు చెందిన 12 ఏళ్ల బాలిక పూరీ జగన్నాథుడి దర్శనం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. ఈ ఆలయంలో 136 ఉప ఆలయాలు ఉండగా.. బాలిక తల్లిదండ్రులు ప్రధాన ఆలయంలో ఉన్నారు. బాలిక మాత్రం వామన్ మందిరంలో దర్శనం కోసం వెళ్లగా.. ఓ పూజారీ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక వామన్ మందిరం నుంచి ఏడుస్తూ బయటకు వచ్చి జరిగిన విషయం తన తల్లికి చెప్పింది. 

దీంతో బాలిక కుటుంబ సభ్యులు సింఘద్వారా పోలీస్ స్టేషన్ లో పూజారీపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ పూజారీని అరెస్ట్ చేశారు. తర్వాత సంక్షేమ కమిటీ చీఫ్ కు సమాచారం అందించారు. మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

Leave a Comment