NRCపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకు సిద్ధం

ఏపీ మంత్రి అంజాద్‌ బాషా వ్యాఖ్యలు

కడప : వైసీపీ..ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అంజాద్‌ బాషా  సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనకు పదవులు కంటే నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అన్నారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధమని, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తామని స్పష్టం చేశారు. ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదన్నారు. 151 సీట్లు గెలిచామని, తాము ఎందుకు ఎన్డీయేలో కలుస్తామని, బీజేపీతో భవిష్యత్తులో కూడా కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీసీలు, మైనారిటీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ తమదని అంజాద్‌ బాషా పేర్కొన్నారు.

 

Leave a Comment