ప్రీ వెడ్డింగ్ షూట్.. శవాల్లా ఫోజులిచ్చిన కొత్త జంట..వీడియో వైరల్..!

పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. వెలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి మరీ ఫొటోలు, వీడియోలు తీయించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ప్రతి జంట వినూత్నంగా తమ ఫొటో షూట్ ఉండాలని ప్రయత్నిస్తోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్లు పోటీ పడి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. 

 తమ ప్రీవెడ్డింగ్ షూట్ డిఫరెంట్ గా ఉండాలని ఎలా ప్రయోగాలకైనా సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో ప్రమాదకరమైన సాహసాలు చేసేందుకూ వెనుకాడట్లేదు. తాజాగా ఓ జంట మరీ వింతా ఆలోచించింది. చనిపోయిన శవాల్లా ఫోజులిచ్చింది. సూసైడ్ చేసుకుని నీటిలో కొట్టుకొచ్చిన ప్రేమికుల జంటలా వాళ్లిద్దరూ స్టిల్స్ ఇచ్చారు. ఆ షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. 

Leave a Comment