‘ప్రధాని మోడీకి ఆ జబ్బు ఉంది.. చికిత్స అందించండి’.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

ప్రధాని మోడీ రోజుకు 2 గంటలే నిద్రపోతారని ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఓ సమావేశంలో చెప్పారు. ప్రధాని ఒక రోజులో 22 గంటల పాటు పనిచేస్తుంటారని అన్నారు. 24 గంటలు మెలకువగా ఉండేందుకు ప్రధాని మోడీ ప్రయోగాలు చేస్తున్నారు అంటూ చంద్రకాంత్ వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోడీపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు. 

ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి.. నిద్రలేకపోవడం అనేది ఒక రోగం.. వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడిని వెంటనే చికిత్స అందించండి’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. 

 

Leave a Comment