ప్రధాని మోడీ రోజుకు 2 గంటలే నిద్రపోతారని ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఓ సమావేశంలో చెప్పారు. ప్రధాని ఒక రోజులో 22 గంటల పాటు పనిచేస్తుంటారని అన్నారు. 24 గంటలు మెలకువగా ఉండేందుకు ప్రధాని మోడీ ప్రయోగాలు చేస్తున్నారు అంటూ చంద్రకాంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోడీపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి.. నిద్రలేకపోవడం అనేది ఒక రోగం.. వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడిని వెంటనే చికిత్స అందించండి’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Please have some common sense… not able to sleep is a medical condition called INSOMNIA.. it should be treated .. not bragged about ..🙏🏻🙏🏻 please take care of your leader #justasking pic.twitter.com/CPj7rP7F6Z
— Prakash Raj (@prakashraaj) March 22, 2022